News April 15, 2024
ఇడుపులపాయ: IIITలో విద్యార్థి ఆత్మహత్య

ఇడుపులపాయలోని IIITలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. మెకానికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సురేఖ హాస్టల్ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన IIIT అధికారులు ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సురేఖ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థి ప్రకాశం జిల్లా జంగం గుంట్ల గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తించారు. వివరాలు
Similar News
News September 6, 2025
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వైవీయూకు ఉన్నత స్థానం: వీసీ

బోధన పరిశోధన సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన వైవీయూ అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుందని వైవీయూ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) 2025లో వైవీయూ 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందన్నారు.
News September 6, 2025
కడప జిల్లా వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిదిలోని బాగాదుపల్లె వినాయక చవితి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గత శుక్రవారం వినాయక చవితి సందర్భంగా ఊరేగింపు సమయంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి కుమ్మితి పాలకొండయ్య (35)కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.
News September 5, 2025
పులివెందులకు బై ఎలక్షన్ ఖాయం: రఘురామ

మాజీ సీఎం జగన్పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చందమామ కోసం మారాం చేసినట్లుగా జగన్ ప్రతిపక్ష హోదా కోసం తాపత్రయపడుతున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. ఎమ్మెల్యేలు శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగా భావించాలి. అసెంబ్లీ ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నా.’ అని తెలిపారు.