News April 15, 2024

ELECTION STORY: నిజామాబాద్ అండ ఎవరికి?

image

నిజామాబాద్ లో ఈ సారి పోటీ రసవత్తరంగా ఉండబోతుంది. గత MP ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6.53 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. BJPకి 45.31శాతం, BRSకు 38.62 శాతం ఓట్లు వచ్చాయి. మెున్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలో BJP మూడో స్థానానికి వెళ్లినా, ఓట్ల పరంగా కాంగ్రెస్, BRSలకు దగ్గరగానే ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు బలపడటంతో త్రిముఖ పోటీ నెలకొంది. మరీ ఎవరు గెలుస్తారో చూడాలి.. దీనిపై మీ కామెంట్

Similar News

News September 10, 2025

NZB: GGHలో వైద్య విభాగాలను తనిఖీ చేసిన DMHO

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ వైద్య విభాగాలను DMHO డాక్టర్ బి.రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షయ నియంత్రణ, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ విభాగం, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని, SNCU విభాగాన్ని పరిశీలించారు. సిబ్బంది పనితీరును హాజరు పట్టికలను వివిధ రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు.

News September 10, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: NZB కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామన్నారు.

News September 10, 2025

నిజామాబాద్: వృద్ధురాలి హత్య

image

సాలూరలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు హత్యకు గురైంది. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చెందర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాటం నాగవ్వ(65)ను ఆమె మరిది గంగారం, కుటుంబ సభ్యులు గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఆస్తి, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.