News April 15, 2024
నరసన్నపేట: పెయింటర్ అనుమానాస్పద మృతి
నరసన్నపేటలోని ఒక పెయింటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నరసన్నపేట పట్టణంలో పెయింటర్గా పనిచేస్తున్న గండి సోమేశ్వరరావు కుటుంబ కలహాలు కారణంగా ఈనెల 11వ తేదీన విశాఖపట్నం వెళుతున్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం అతని మృతదేహం కనిపించింది. మండలంలోని సత్యవరం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.
Similar News
News September 7, 2024
బొరివంకలో అపురూప దృశ్యం
వినాయక చవితి రోజున కవిటి మండలం బొరివంక గ్రామంలో అపురూప దృశ్యం కనువిందు చేసింది. గ్రామస్థుడు మజ్జి బోనమాలి తమ తోటలో పెరుగుతున్న కర్ర పెండలం దుంపలో గణనాథుని రూపం కనిపించడంతో సిద్ధి వినాయక మండపం వద్దకు తీసుకొచ్చాడు. వినాయకుని రూపంలోనే ఉండడంతో స్థానిక భక్తులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు చూడటానికి ఎగబడ్డారు.
News September 7, 2024
డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 46 శాతం పీజీ ప్రవేశాలు
ఎచ్చెర్ల డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను పీజీ ప్రవేశాలు 46 శాతం నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ పీజీ సెట్-2024 అలాట్ మెంట్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. వివిధ కోర్సుల్లో మొత్తం 562 సీట్లకు గాను 259 సీట్లకు ప్రవేశాలు జరిగాయి. విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంది.
News September 7, 2024
కవిటి ఉద్దాన ప్రాంతంలో మొక్క పెసలతో బొజ్జ గణపయ్య
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బోరువంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది (ముగ్ద గణపతి) పెసర విత్తనాలు వేసి నారుతో తయారుచేసిన విగ్రహాన్ని క్లబ్బుకు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగని గణపయ్యలను తయారు చేయడమే ఈయన ప్రత్యేకత.