News April 15, 2024

నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి

image

పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్‌ను రాష్ట్ర అధిష్ఠానం ఎన్నుకున్నట్లు కొమ్మలపాటి తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా అధిష్ఠానం తనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, పార్టీ అభివృద్ధి గెలుపుకు కృషి చేస్తానని కొమ్మాలపాటి అన్నారు. అయితే పలువురు పార్టీ పెద్దలు అతనికి అభినందనలు తెలిపారు.

Similar News

News December 27, 2025

GNT: మంత్రి పేరిట మోసం.. రూ.1.15 కోట్లు టోకరా.!

image

మంత్రి కొల్లు రవీంద్రకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.. లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామంటూ రూ.1.15 కోట్లు వసూలు చేసిన వంకాయలపాటి రాంబాబు, సాయికిరణ్‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. SVN కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా లిక్కర్ మార్ట్ మంజూరు కాలేదు. బాధితుడు మంత్రిని కలవగా వారు తనకు తెలియదని చెప్పడంతో మోసపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు.

News December 27, 2025

GNT: నేడు జీఎంసీ కౌన్సిల్ సమావేశం .

image

గుంటూరు నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఈ మేరకు మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవ్వాలని కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

News December 27, 2025

గుంటూరు: ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5 లక్షలు టోకరా

image

తాడికొండ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం చీటింగ్ కేసు నమోదైంది. రావెల గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు వీలేటి నాగచైతన్య వివరాల మేరకు.. మైలబత్తుల బాబు మహేష్, బాలరామ్, నందా కలిచ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ ఆఫర్ లేఖ చూపించి, రూ.5 లక్షలు తీసుకున్నారన్నారు. అనంతరం కంపెనీకి వెళ్లగా, ఆ ఆఫర్ లేఖ నకిలీదని తేలింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు.