News April 15, 2024
నేడు కాంగ్రెస్లోకి మదన్రెడ్డి

TG: మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. నర్సాపూర్ మాజీ MLA మదన్రెడ్డి బీఆర్ఎస్ను వీడి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు CM రేవంత్ సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం నర్సాపూర్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన HYD చేరుకోనున్నారు. పదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించానని, తనను అభిమానించే వారంతా కాంగ్రెస్లో చేరుతారని మదన్రెడ్డి తెలిపారు.
Similar News
News January 24, 2026
వేములవాడ: మున్సిపాలిటీ నుంచి పంచాయతీకి.. మళ్ళీ పురపాలికగా

ఇప్పటి వేములవాడ మున్సిపాలిటీ ఆరు దశాబ్దాల కింద కూడా మున్సిపాలిటీగా ఉండేది. 1965 వరకు మున్సిపాలిటీగా కొనసాగిన వేములవాడను ఆ తర్వాత గ్రామపంచాయతీగా మార్చారు. ఆ తర్వాత మేజర్ పంచాయతీగా మారిన వేములవాడను 2011లో నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేశారు. 2018లో మూడో శ్రేణి మున్సిపాలిటీగా మార్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న వేములవాడలో ప్రస్తుతం సుమారు 60 వేల జనాభా ఉండగా, 40877 మంది ఓటర్లు ఉన్నారు.
News January 24, 2026
HYD: పిల్లల స్కూల్ ఫీజు 140% పెరిగింది సీఎం సార్!

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.
News January 24, 2026
TODAY HEADLINES

⋆ తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
⋆ ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: సీఎం చంద్రబాబు
⋆ ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలకుపైగా కేటీఆర్ విచారణ
⋆ పూర్తిగా సహకరించా.. పోలీసులు నీళ్లు నమిలారు: KTR
⋆ తిరుమల కల్తీనెయ్యి కేసులో ఫైనల్ ఛార్జ్షీట్.. మరో 12 మందిని నిందితులుగా చేర్చిన CBI
⋆ రెండో టీ20లో NZపై భారత్ విజయం
⋆ WHO నుంచి వైదొలగిన అమెరికా


