News November 19, 2025
VZM: జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్కు జిల్లా విద్యార్థులు

జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్కు విజయనగరం జిల్లాలోని ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరగనున్న జాతీయ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొంటారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు అయ్యలు, వేణుగోపాల్ రావు బుధవారం అభినందించారు.
Similar News
News March 21, 2026
HYD: ‘హోమియో’కు పెరుగుతున్న ఆదరణ

తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ అయిన హోమియోపతి రామంతపూర్ ఆస్పత్రికి రోజురోజుకూ ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 700 మంది వరకు రోగులు చికిత్స కోసం ఆస్పత్రిని సందర్శిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజల్లో హోమియో వైద్యం పట్ల విశ్వాసం పెరుగుతుండటంతో ఈ సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఉ.10:30 గం. నుంచి సా.5:30 వరకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
News March 21, 2026
పోలవరం: గేదె దూడను హతమార్చిన పెద్దపులి

పోలవరం జిల్లా సరిహద్దు గ్రామమైన ఏలేశ్వరం మండలం మర్రివీడు శివారున శనివారం తెల్లవారుజామున ఒక గేదె దూడను పెద్ద పులి హత మార్చింది. గ్రామానికి చెందిన అనుసరి రాంబాబు పశువుల కొట్టంపై దాడి చేసి ఒక గేదె దూడను చంపి కొంత దూరం తీసుకుపోయిందని గ్రామస్తులు చెప్పారు. పులి రూటు మార్చుకొని మళ్లీ యథాస్థానం ఏలేరు ప్రాజెక్టు ప్రాంతానికి చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
News March 21, 2026
రైళ్లలో చోరీలు.. విశాఖలో కాకినాడ వాసి అరెస్టు

రన్నింగ్ ట్రైన్స్లో ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్.ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్టాప్లు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన చెప్పారు.


