News November 19, 2025

ఆస్పత్రి బెడ్‌షీట్‌లు ఈ రంగులోనే ఎందుకు?

image

ఏదోక రుగ్మతతో ఆస్పత్రికి వెళ్లే ఉంటారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో బ్లూ, గ్రీన్ బెడ్‌షీట్‌లే ఎక్కువగా ఉంటాయని ఆలోచించారా? RBGకి ప్రాథమిక రంగుల స్వభావం ఉంటుంది. గ్రీన్‌, బ్లూ క్లాత్‌పై బ్లడ్ పడితే దాని ప్రభావం తగ్గి, నల్లటి ఛాయగా కనిపిస్తుంది. వేరే రంగు వస్త్రాలపై రక్తం పడితే అది డార్క్‌ రెడ్‌గా కనిపించి, హిమోఫోబియా ఉన్నవారు భయపడకుండా ఈ కలర్స్‌వి వేస్తారు. ఉతికాక వీటి రంగు వెలిసినా తేడా తెలియదు.

Similar News

News March 12, 2026

భద్రాద్రి: విద్యార్థులు.. మన పంట.. మన భోజనం

image

అశ్వాపురం మండలం మిట్టగూడెంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి కళాశాల ప్రాంగణంలో ఆకుకూరలు, కూరగాయల తోటలను పెంచుతున్నారు. ఇక్కడ పండించిన తాజా కూరగాయలనే హాస్టల్ మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో శ్రమ విలువను పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ప్రిన్సిపల్ బి.రవి తెలిపారు. విద్యార్థుల ఈ చొరవను పలువురు అభినందిస్తున్నారు.

News March 12, 2026

ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తాం: క్యాప్ జెమినీ సీఈవో

image

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేశ్ గురువారం విశాఖలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ అన్నారు. 1967లో పారిస్ కేంద్రంగా ఏర్పాటైన తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 2లక్షల మంది వరకు ఒక్క భారత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది).

News March 12, 2026

విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు జమ

image

TG: రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25కు గాను స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజు కింద వారి ఖాతాల్లో రూ.374 కోట్లు జమ చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.201 కోట్లు, రాష్ట్రం వాటా రూ.173 కోట్లు. ఈ మొత్తంతో 83,239 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరింది.