News November 19, 2025
HYD: ముందే ఉంటుంది మృత్యువు.. చూసి వెళ్లండి

శీతాకాలంలో పొగమంచు పెరగడంతో రోడ్లపై ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసు అధికారులతో సమీక్షించారు. ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్న సీపీ, వేగ నియంత్రణ, హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు వంటి ముందస్తు చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 21, 2026
అన్నమయ్య: ‘గ్యాస్’ సమస్యలా.. కాల్ చేయండి..!

అన్నమయ్య జిల్లాలోని 31 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు జేసీ శివ నారాయణ శర్మ తెలిపారు. కలెక్టరేట్లో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలతో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సమస్యలపై 08571-293001కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News March 21, 2026
పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనాలి: జనగామ కలెక్టర్

సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం చెందిన నర్మెట్ట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమంలో జనగామ జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. జిల్లాలోని 12 మండలాలకు నుంచి 39 ప్రత్యేక ఆర్టీసీ పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు హాజరు కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
News March 21, 2026
పల్నాడు జిల్లాలో వర్షం

పల్నాడు జిల్లా వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంటలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మెరుపులు, ఈదురు గాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు కొనసాగించాలన్నారు. పెదకూరపాడు, రొంపిచర్ల, అమరావతి మండలాల్లో వర్షం కురిసింది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది..?


