News November 19, 2025

మలికిపురం: బాలిక జాహ్నవి మృతదేహం లభ్యం

image

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన శిరిగినీడి జాహ్నవి (9) మృతదేహం బుధవారం లభ్యమైంది. తండ్రి శిరిగినీడి దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. సోమవారం ఆధార్ అప్డేట్ చేయిస్తానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వారిని నదిలో తోసేసి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Similar News

News March 11, 2026

కాకతీయ యూనివర్సిటీకి CPGET-2026 నిర్వహణ బాధ్యతలు

image

రాష్ట్రంలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక CPGET-2026 పరీక్షల నిర్వహణ బాధ్యతలు వరంగల్‌లోని కేయూకు దక్కాయి. గత కొన్నేళ్లుగా ఈ పరీక్షలను హైదరాబాద్ OU నిర్వహిస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేసి బాధ్యతలను కేయూకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు.

News March 11, 2026

MP అర్వింద్ ఆతిథ్యం అద్భుతం: నారా లోకేశ్

image

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆతిథ్యం అద్భుతమని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఓ సమ్మిట్ కోస ఢిల్లీ వెళ్లిన లోకేశ్‌ను అర్వింద్ తన ఇంటికి ఆహ్వానించారు. “అద్భుతమైన భోజనం, అంతకు మించిన మంచి స్నేహంతో గడిపిన సమయం చిరస్మరణీయం. మీ ఆత్మీయత నిజంగా స్ఫూర్తిదాయకం, మీ అభిమానిగా మారిపోయాను” అంటూ విందులో పాల్గొన్న లోకేశ్ తన సంతోషాన్ని పంచుకున్నారు.

News March 11, 2026

వరంగల్: బార్లలో ‘తక్కువ’కే మద్యం!

image

వరంగల్ నగరంలోని మద్యం విక్రయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా వైన్ షాపుల కంటే బార్లలో ధరలు అధికంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి తలకిందులైంది. లైసెన్సు ఫీజుల భారం, పెరిగిన లిక్కర్ మార్టుల పోటీతో బార్లలో గిరాకీ తగ్గింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు బార్ల యజమానులు వైన్ షాపుల కంటే తక్కువ ధరలకే మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం నగరంలో చర్చనీయాంశంగా మారింది.