News April 15, 2024

తూ.గో.: ఫ్రెండ్స్‌తో కలిసి పొలానికి.. తిరిగొస్తుండగా మృతి

image

తూ.గో. నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం శివారులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవీంద్ర (24) ఆదివారం స్నేహితులతో కలిసి పొలం వెళ్లగా తల్లి ఫోన్‌ చేసి ఇంటికి రమ్మంది. ఈ క్రమంలో బైపాస్‌పై బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. అంబులెన్స్‌లో నల్లజర్ల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Similar News

News October 7, 2025

ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకతకు కృషి: జేసీ

image

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నాయని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 871 చౌకధరల దుకాణాలు సక్రమంగా పనిచేస్తున్నాయన్నారు. రేషన్ కార్డుదారులకు 93% నుంచి 94% వరకు నిత్యావసర వస్తువులు సమయానికి సరఫరా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

News October 6, 2025

నవోదయం 2.0 సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా వెంటనే కాల్ సెంటర్ 14405 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా. కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్, జిల్లా అధికారుల సమీక్షలో ఆమె ఈ విషయం చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు.

News October 6, 2025

పోలీస్ పీజీఆర్ఎస్‌కు 25 పిర్యాదులు: ఎస్పీ

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (ప్రజావాణి) కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ నరసింహకిషోర్‌ తెలిపారు. ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, న్యాయం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్పీలు ఎన్‌బిఎం మురళీకృష్ణ, సుబ్బారాయుడు పాల్గొన్నారు.