News November 19, 2025

HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

image

రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News December 8, 2025

NTR: కమిషనరేట్‌ పీజీఆర్ఎస్‌కు 82 ఫిర్యాదులు

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో మొత్తం 82 ఫిర్యాదులు స్వీకరించారు. డీసీపీ శ్రీ ఎస్.వి.డి. ప్రసాద్, ఏడీసీపీ శ్రీ ఎం. రాజారావు బాధితుల సమస్యలను నేరుగా విన్నారు. భూవివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలు, మహిళా సమస్యలపై ఈ ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

News December 8, 2025

రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసులు

image

TG: పార్లమెంటు సభ్యులపై <<18438395>>అనుచిత<<>> వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. బ్రిజ్‌లాల్, గోపాలస్వామి ఆమెపై రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాటిని ఆయన ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ఇటీవల ఆమె పార్లమెంటుకు పెంపుడు కుక్కను తీసుకెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పరోక్షంగా ఎన్డీఏ సభ్యులను ఉద్దేశిస్తూ కరిచే వాళ్లు లోపల ఉన్నారని వ్యాఖ్యానించారు.

News December 8, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* కామారెడ్డి: వేడుకల నిర్వాహణలో మహిళల పాత్ర అభినందనీయం
* దోమకొండ: పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
* కామారెడ్డి: రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
* బికనూర్: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
* దోమకొండ: ఎన్నికలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలి
* మాచారెడ్డి: రేపు సాయంత్రం నుంచి వైన్సులు బంద్