News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News March 17, 2026
బెంగాల్లో బిగ్గెస్ట్ ఫైట్.. మమత vs సువేందు

పశ్చిమ బెంగాల్లో మరోసారి హైవోల్టేజ్ ఫైట్ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఒకే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ సౌత్ కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. APR 23 నుంచి 29 మధ్య రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను ఓడించిన సువేందు ఈసారి ఆమె సొంత నియోజకవర్గంలోనే పోటీకి దిగడం గమనార్హం.
News March 17, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 12,781 మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో మంగళవారం 60 సెంటర్లలో ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్ పేపర్-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. నేటి పరీక్షలకు 13,156 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 12,781 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారు. 375 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు.
News March 17, 2026
ఈ నెల 22న ఖమ్మం బంద్కు పిలుపు

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేసిన చోటే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న ‘ఖమ్మం బంద్’కు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపునిచ్చింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు అన్నారు. వ్యాపార వర్గాలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.


