News November 19, 2025

అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

image

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్‌ఛార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా నియమించారు.

Similar News

News March 20, 2026

విశాఖ ఉమ్మడి జిల్లాకు ఒకే ఏటీఎస్

image

విశాఖ ఉమ్మడి జిల్లాల వాహనదారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. సబ్బవరం (M) దేవీపురంలో ఉన్న ఒకే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ వద్ద రోజూ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఎనిమిదేళ్ల లోపు వాహనాలకు రెండేళ్లకు ఒకసారి, ఆపై ప్రతి ఏడాది ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి కావడంతో ఒత్తిడి పెరిగింది. ఆయితే ఉమ్మడి జిల్లాలో మరోక సెంటర్ ఏర్పాటు చెయాలన్న ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చలేదు.

News March 20, 2026

గుంటూరులో ప్రత్యేక డ్రైవ్.. రూ.5.36 లక్షల జరిమానా

image

గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డు, కాకాని రోడ్డులో పోలీసులు జాతీయ, రాష్ట్ర రహదారులపై గురువారం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 922 వాహనదారులకు రూ.5.36 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. హెల్మెట్, సీటు బెల్ట్, లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల భద్రత పెంచడం ప్రధాన లక్ష్యం అని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

News March 20, 2026

మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి!

image

TG: డ్రగ్స్ కేసులో <<19404520>>అరెస్టయిన<<>> Ex MLA పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. జంగయ్య అనే వ్యక్తి పేరుతో ల్యాండ్ ఉందని సమాచారం. దీంతో ఆ భూమి రోహిత్ రెడ్డి చేతికి ఎలా వెళ్లిందనేది తెలుసుకుంటామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఫామ్‌హౌస్‌ను సీజ్ చేస్తామంటున్నారు.