News April 15, 2024
ఆమెకు నిద్ర పట్టాలంటే ఎక్స్ట్రా పెగ్ వేసుకోవాలి: బీజేపీ నేత

కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బల్కర్పై ఆ రాష్ట్ర BJP నేత సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘BJPకి మహిళల మద్దతు పెరుగుతుండటంతో లక్ష్మికి నిద్ర పట్టడం లేదు. రాత్రి నిద్ర పట్టాలంటే ఆమె స్లీపింగ్ పిల్ కానీ, ఎక్స్ట్రా పెగ్ కానీ వేసుకోవాలి’ అని అన్నారు. దీనిపై స్పందించిన లక్ష్మి మహిళలకు BJP ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. జైశ్రీరామ్ నినాదాలు చేస్తే సరిపోదని, మహిళలను గౌరవించాలని హితవు పలికారు.
Similar News
News February 3, 2026
జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

భారత్లోని ప్యాసింజర్ వాహన కంపెనీలకు ఈ ఏడాది జనవరి కలిసొచ్చింది. గత నెలలో అన్ని కంపెనీలు 4.5 లక్షల యూనిట్లను విక్రయించాయి. 2025 జనవరితో పోలిస్తే ఇది 12.6% ఎక్కువ. అమ్మకాల్లో మారుతీ సుజుకీ ఇండియా తొలి స్థానంలో నిలవగా, తర్వాత టాటా మోటార్స్, M&M, హ్యుందాయ్ మోటార్స్, టొయోటా సంస్థలు ఎక్కువ వాహనాలను విక్రయించాయి. GST సంస్కరణలు, SUVలకు డిమాండే ఈ సేల్స్ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
News February 3, 2026
ఇంట్లో ఎలాంటి విగ్రహాలు ఉంటే శుభప్రదం?

కూర్చున్న భంగిమలో ఉన్న దైవ స్వరూపాలనే ఇంట్లో ప్రతిష్ఠించాలి. వాటిని పూజిస్తే ప్రశాంతత, స్థిరమైన సంపద లభిస్తాయి. కులదైవం, ఇష్టదైవం విగ్రహాలను కూడా ఉంచవచ్చు. శివలింగం బొటనవేలు పరిమాణం కంటే తక్కువ ఉన్నవి ఎంచుకోవాలి. విగ్రహాలు వెండి, రాగి లేదా ఇత్తడి వంటి లోహాలతో చేసినవి లేదా మట్టితో చేసినవి వాడటం వల్ల సాత్విక శక్తి పెరుగుతుంది.
News February 3, 2026
లండన్లో మంత్రి నారాయణ పర్యటన

AP: అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాజెక్టుల అధ్యయనం కోసం యూకేలో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతిలో అమలు చేయగలిగే ఆధునిక పట్టణ ప్రణాళిక, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వంటి అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ డైరెక్టర్ గ్విన్ రిచర్డ్స్తో మంత్రి సమావేశమయ్యారు. లండన్ మాస్టర్ ప్లాన్, రవాణా, అభివృద్ధి ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.


