News November 19, 2025
HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 21, 2026
అనంత: స్వగ్రామానికి మాజీ MLA భౌతికకాయం తరలింపు

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనంతపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లికి తరలించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.
News March 21, 2026
నల్గొండ రోడ్లకు ‘బడ్జెట్’ మొండిచేయి!

రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. జిల్లాకు చెందిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, సొంత జిల్లా రహదారుల అభివృద్ధికి బడ్జెట్లో ఆశించిన ప్రాధాన్యత దక్కలేదు. అధ్వాన్నంగా ఉన్న చిట్యాల-భువనగిరి, నల్గొండ -కొండమల్లేపల్లి వంటి రహదారుల విస్తరణకు నిధుల ప్రస్తావన ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. జిల్లావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News March 21, 2026
నల్గొండ జీజీహెచ్లో వేధింపుల కలకలం..!

నల్గొండ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్సోర్సింగ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.


