News November 19, 2025

HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

image

రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News March 11, 2026

లక్షెట్టిపేట: వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి

image

లక్షెట్టిపేటలోని కొత్త ఫ్లాట్లకు చెందిన లకావత్ గణేష్(45) వడదెబ్బతో మృతి చెందాడని ఏఎస్ఐ అన్వర్ హుస్సేన్ తెలిపారు. వడదెబ్బ తగిలిందని గణేష్ మంగళవారం కొడుకు రాజేశ్వర్‌ను రూ.20 అడిగి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. బుధవారం ఇటిక్యాల చెరువు వద్ద గణేష్ శవం ఉందని స్థానికులు చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. గణేష్ చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు ఏఎస్ఐ వెల్లడించారు.

News March 11, 2026

సిద్దిపేట: మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ అసహనం

image

కోహెడ మండలం శనిగరంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ కె. హైమావతి బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో పప్పు పలుచగా ఉండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం తంగళ్లపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థుల భోజనం, వసతి, చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

News March 11, 2026

KNR: ‘డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి’

image

డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు.