News November 19, 2025
అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్గా నియమించారు.
Similar News
News March 7, 2026
‘విజయ’ బ్రాండ్తో కల్తీ.. AP డెయిరీపై ఆరోపణలు

TG: AP విజయ డెయిరీ తీరుపై తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అమిత్ రెడ్డి మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని ఆరోపించారు. మేఘనా ఫుడ్స్ తయారు చేస్తున్న నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. AP ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
News March 7, 2026
SRPT: టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్ సెషన్: డీఈఓ అశోక్

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఈనెల 9న ఉదయం 10:30 నుంచి ప్రత్యేక మోటివేషన్ సెషన్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. టీ-శాట్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా సూచనలు చేస్తారు. పాఠశాలల్లోని ఐఎఫ్పీల ద్వారా విద్యార్థులందరూ ఈ సెషన్ను వీక్షించేలా ప్రధానోపాధ్యాయులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
News March 7, 2026
WGL: రంజాన్.. మసీదులకు లైటింగ్ ఏర్పాటు

రంజాన్ పర్వదినం సందర్భంగా మసీదులకు లైటింగ్ ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం GWMC సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ పాల్గొని ముస్లింలకు ఇబ్బందులు కలగకుండా బల్దియా ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్లలో దెబ్బతిన్న లైట్లను పునరుద్ధరించడంతో పాటు ఎన్పీడీసీఎల్ వారి సమన్వయంతో వీధి దీపాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు.


