News April 15, 2024

బెల్లంపల్లి: రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

image

అప్పుల బాధ, కల్లుకు బానిసై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామానికి చెందిన బన్న మల్లేష్ (49) కల్వరి చర్చి వెనకాల రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె. సురేష్ గౌడ్ తెలిపారు. అప్పుల బాధతో కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 1, 2025

ఆదిలాబాద్ అడవుల్లో హైనా సంచారం

image

దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే క్రూర మృగం హైనా ఆదిలాబాద్ జిల్లా మావల అడవుల్లో సంచరించడం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో హైనా దృశ్యాలు రికార్డయ్యాయి. మావల హరితాహారం లోని సీసీ కెమెరాల్లో ఈ చిత్రం శుక్రవారం కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన హైనాలు తిరిగి మావల అడవుల్లో కనిపించిందన్నారు.

News February 1, 2025

జాతీయస్థాయి పోటీల్లో ADBకు 10 పతకాలు

image

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్, వీరేష్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జనవరి 27 నుంచి 30వ వరకు పోటీలు జరిగినట్లు పేర్కొన్నారు. జిల్లాకు 2 స్వర్ణ, 3 వెండి, 5 రజత పతకాలు వచ్చాయన్నారు.

News February 1, 2025

శ్యాంపూర్‌లో పర్యటించిన మంత్రి సీతక్క

image

ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో రాష్ట్రమంత్రి సీతక్క శుక్రవారం పర్యటించారు. గ్రామంలో కొలువుదీరిన దైవం బుడుందేవ్‌ను ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేష్, మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.