News November 19, 2025
యువత 20 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలి: శ్రీధర్

యువత పెళ్లి కంటే కెరీర్పై ఫోకస్ చేయడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాకు సంకేతమన్న ఉపాసన <<18317940>>వ్యాఖ్యలపై<<>> ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. యువ వ్యాపారవేత్తలు, స్త్రీ, పురుషులు 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని తాను సూచిస్తానన్నారు. ‘సమాజానికి జనాభాను అందించే డ్యూటీని యువత నిర్వర్తించాలి. ఆ ఆలోచనలు విచిత్రంగా, పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. కానీ కాలక్రమంలో అందరూ దీన్నే అనుసరిస్తారు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
‘సిగ్గుచేటు’.. బెంగాల్ ప్రభుత్వంపై మోదీ ఫైర్

బెంగాల్లోని TMC ప్రభుత్వంపై PM మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>>ను అవమానించేలా బెంగాల్ యంత్రాంగం వ్యవహరించడం సిగ్గుచేటని, ఇది ప్రజాస్వామ్యానికే విఘాతమని విమర్శించారు. సంతాల్ సంస్కృతిని TMC ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతమని, ఆ పదవికి ఉన్న పవిత్రతను గౌరవించాలని హితవు పలికారు.
News March 7, 2026
నాలుగుసార్లు ప్రధాని.. చిత్తుగా ఓడిపోయారు

నేపాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఆ దేశానికి నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ(CPN-UML) సొంత నియోజకవర్గం జాఫా-5లో చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై RSP అభ్యర్థి బాలేంద్ర షా 49,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఓవరాల్గా 165 స్థానాలకుగాను RSP 67 చోట్ల గెలిచింది. 55 సెగ్మెంట్లలో లీడింగ్లో ఉంది. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్తో పోటీ పడుతున్నాయి.
News March 7, 2026
ఇకపై రైతుల అకౌంట్లకే సబ్సిడీ నిధులు: తుమ్మల

TG: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులు కొనుగోలు చేసిన పనిముట్లకు 40% సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తోంది. ఇకపై అన్నదాతల ఖాతాలకే ఆ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. APR నెలాఖరులోగా పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఖరీఫ్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించాలన్నారు. ఈసారి 60.60L హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.


