News November 19, 2025
NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్లోని కలెక్టరేట్లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్తో సమీక్షలో ఉన్నారు.
Similar News
News March 5, 2026
NZB: జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి: కలెక్టర్

జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు ధరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని సూచించారు.
News March 5, 2026
NZB: జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి: కలెక్టర్

జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు ధరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని సూచించారు.
News March 4, 2026
NZB: ఇక్రిశాట్ను సందర్శించిన రైతు కమిషన్ బృందం

పటాన్ చెరులోని ఇక్రిశాట్ను ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డితో కలిసి రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యుడు గడుగు గంగాధర్ తదితర బృందం సందర్శించింది. ఫీల్డ్ విజిట్లో భాగంగా ఇక్రిశాట్లో సాగు చేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు. అక్కడి శాస్త్రవేత్తలతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని కోరారు.


