News November 19, 2025
iBOMMA బంద్.. ఇక కలెక్షన్లు పెరుగుతాయా?

iBOMMA క్లోజవడంతో సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవి వల్ల ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగిందని, ఇకపై తమకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అయితే పైరసీ ఆగినందున మూవీల కలెక్షన్లు పెరుగుతాయా? అనే చర్చ మొదలైంది. సినిమాల్లో సత్తా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకే వెళ్తారని, ఇది ఎన్నోసార్లు రుజువైందని నెటిజన్లు పేర్కొంటున్నారు. కలెక్షన్లపై పైరసీ ప్రభావం నామమాత్రమేనంటున్నారు. మీరేమంటారు?
Similar News
News March 5, 2026
సెమీస్లో టీమ్గా రాణిస్తారా?

T20WC: ఈరోజు ఇంగ్లండ్తో సెమీస్లో భారత్ వన్ మ్యాన్ షోలపై ఆధారపడకుండా జట్టుగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచుల్లో ఎవరో ఒకరు రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నారు. ఈసారి భారత్ ఆ తప్పు చేయొద్దంటున్నారు. వాంఖడేలో షార్ట్ బౌండరీస్ను అడ్వాంటేజ్గా తీసుకొని బ్యాటర్లు సమష్టిగా రాణించాలని.. బౌలింగ్, ఫీల్డింగ్లోనూ తడబడకూడదని కోరుకుంటున్నారు.
News March 5, 2026
రేపటి నుంచి భగభగలు!

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్ 38°C దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిన్న కర్నూలులో అత్యధికంగా 38.5°C నమోదైంది. అటు తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 40+డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News March 5, 2026
యుద్ధంపై బెట్టింగ్.. ₹కోట్లు గెలుచుకున్నారు!

US-ఇరాన్ యుద్ధంతో ఓ పక్క ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే కొందరు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం కాసులపంట పండించుకున్నారు. ఇరాన్పై US ఎప్పుడు దాడి చేస్తుందో అంచనా వేసి పాలీమార్కెట్ అనే క్రిప్టో ప్లాట్ఫామ్లో గత శుక్రవారం 150 మంది బెట్ కాశారు. వీరిలో 16 మంది లక్ష డాలర్లు, ఓ వ్యక్తి 5లక్షల డాలర్లు (₹4కోట్లు) సంపాదించారు. అయితే యుద్ధంపైన బెట్టింగ్ ఏంటని పాలీమార్కెట్ సహా యూజర్లపై విమర్శలు వస్తున్నాయి.


