News November 19, 2025
ఖమ్మం: గుర్తించుకుందాం.. ‘ఆయన’ తెర వెనుక పోరాటం

ఖమ్మం: సమాజంలో స్త్రీలు, వారి త్యాగాల గురించి మాట్లాడుకుంటాం. కానీ NOV19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎవరూ మాట్లాడుకోరు. వ్యక్తిగతంగా బాధయినా, ఉద్యోగంలో ఒత్తిడికి గురైనా బయటకు చెప్పుకోలేక, లోలోపల కుమిలిపోతున్నారు. కానీ నేడు జిల్లాలో పలుచోట్ల దుర్భుద్దితో భర్తలపై కొందరు భార్యలు చేస్తున్న అఘాయిత్యాలు కలవెర పెట్టిస్తున్నాయి. ఆయన ఏంచేసినా అది కుటుంబం కోసమే. వారికి అండగా ఉందాం.. శ్రమను గుర్తించుకుందాం.
Similar News
News March 18, 2026
విశాఖలో మళ్లీ వారికే సీట్లు: బొత్స హామీ

కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్పొరేటర్లకు వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అవిశ్వాస సమయంలో ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి తోడుగా ఉన్న వారిని ప్రోత్సహిస్తామని కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. విశాఖలో భూ ఆక్రమణలు పెరిగాయని, కూటమి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
News March 18, 2026
మెదక్ జిల్లాలో ఆసుపత్రి సేవలపై డీసీహెచ్ఎస్ సమీక్ష

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచాలని డీసీహెచ్ఎస్ డా. శివ్ దయాల్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, కౌడిపల్లి ఆసుపత్రుల వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓపీ, ఐపీ సేవలు, ప్రసవాలు, డయాలసిస్ విభాగాల పనితీరును పరిశీలించారు. ఆసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
News March 18, 2026
3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

TG: హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.


