News November 19, 2025

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్‌ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.

Similar News

News March 4, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ‘పిక్సెల్’ షికారీలు

image

HYD GEN Z ఖరీదైన ఐఫోన్ ఫొటోల కంటే పాత కాలపు ‘డిజిటల్ కెమెరాల’ కోసం జుమ్మెరాత్ బజార్‌ను జల్లెడ పడుతున్నారు. ఆ ‘గ్రెయిన్’, ఆ ‘బ్లర్’ ఇమేజ్‌లే ఇప్పుడు SMలో అసలైన కిక్కు. ఎడిటింగ్ లేని పచ్చి నిజం లాంటి ఫొటోల కోసం ఈ కుర్రాళ్లు అర్ధరాత్రి పూట మోజంజాహీ మార్కెట్ శిథిలాల వెనుక తిరుగుతున్నారు. గతాన్ని ఫిల్టర్ లేకుండా చూపించడమే వీరి జీవనశైలి. ఈ ‘పిక్సెల్ షికారీలు’ సరికొత్త ఆర్ట్ ఫామ్‌ను సృష్టిస్తున్నారు.

News March 4, 2026

నియోపోలిస్ భూమి ‘యూ-టర్న్’.. సర్కారు వెనకడుగు!

image

కోకాపేటలో రిజర్వాయర్ల కోసం కేటాయించిన 3.95 ఎకరాల విషయంలో సర్కారు అడ్డంగా దొరికిపోయింది. శారదా పీఠం భూములను HMWSSBకి ఇస్తూ FEB 28న GO ఇచ్చారు. పీఠం రిప్రజెంట్లు CMను కలవడంతో ఆ భూ కేటాయింపు రద్దయింది. 592మీటర్ల ఎత్తు నుంచి సప్లై చేస్తేనే పాతబస్తీ, మెహదీపట్నంకు కరెంట్ ఖర్చు లేకుండా నీళ్లు వెళ్తాయి. ఇప్పుడు ఆ స్థలం పోవడంతో ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.వందల కోట్లు పెరుగుతుందన్నది గ్రౌండ్ రిపోర్ట్.

News March 4, 2026

HYD: మెట్రో హంగులకు ఇక గుడ్-బై!

image

L&T చేతిలో ఉన్న HYD మెట్రో ఫేజ్-1 ఇక పక్కా ప్రభుత్వ ఆస్తి కాబోతోంది. MAR 31 నాటికి అప్పగింత పూర్తి కావాల్సిందేనని CS నుంచి డెడ్ లైన్ వచ్చింది. సుమారు రూ.15,000 కోట్ల భారీ డీల్ ఇది. ఈ డబ్బు కోసం ప్రభుత్వం ఇప్పుడు IRFC దగ్గర తక్కువ వడ్డీకి అప్పు కోసం తిరుగుతోంది. ప్రభుత్వ మెట్రోలో సామాన్యుడికి టికెట్ ధరలు తగ్గుతాయా?, కనీస మెయింటెనెన్స్ లేక మెట్రో ‘ఆర్టీసీ’లా మారుతుందా? అని జనం టెన్షన్ పడుతున్నారు.