News November 19, 2025
రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.
Similar News
News March 18, 2026
శ్రీశైలంలో నేటి పూజా కార్యక్రమాలు

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం..
◆ ఉ.8 గంటల నుంచి చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, జపానుష్ఠానాలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన, చండీహోమం
◆ సా.5 గంటల నుంచి సాయంకాలార్చనలు, నిత్యహవనాలు,రుద్రహోమం
◆ సా.5:30 గంటలకు ప్రభోత్సవం
◆ రాత్రి శ్రీస్వామి, అమ్మవారికి నందివాహన సేవ, మహాసరస్వతి అలంకారం, కల్యాణ మహోత్సవం, ఏకాంతసేవ
◆ వీరాచార విన్యాసములు, అగ్నిగుండ ప్రవేశం
News March 18, 2026
ఖమ్మం: నీటి ఎద్దడిపై అధికారుల ‘యాక్షన్ ప్లాన్’

ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను గుర్తించి, అక్కడ ట్యాంకర్లు లేదా ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చామని, మరమ్మతుల కోసం సుమారు రూ.90 లక్షలు ఖర్చవుతుందని ఈఈ పుష్పలత తెలిపారు.
News March 18, 2026
ఖమ్మం: ‘వనజీవి రామయ్య’కు గద్దర్ అవార్డు

పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా దర్శకుడు వేముగంటి రూపొందించిన ‘వనజీవి రామయ్య’ లఘుచిత్రం గద్దర్ ఫిల్మ్ అవార్డుకు ఎంపికైంది. బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని మంగళవారం HYD ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించారు. తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ్లు చిత్రబృందాన్ని అభినందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.


