News November 19, 2025
అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్గా నియమించారు.
Similar News
News March 21, 2026
నిర్మల్: పర్యావరణానికి అటవీ సంపద ఊపిరి

ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 1,778.26 చ.కి.మీ అడవి ఉండగా, మంచిర్యాల 1,564.93, ఆదిలాబాద్ 1,145.76, నిర్మల్లో 1,085.02 చ.కి.మీ విస్తరించి ఉంది. ఈ అటవీ సంపద ప్రాంతీయ జీవవైవిధ్యానికి, వర్షపాత సమతుల్యతకు దోహదపడుతోంది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ఈ అడవులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
News March 21, 2026
పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

హైదరాబాద్లో వేర్వేరు ఘటనల్లో పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దన్నందుకు అల్వాల్కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ నిన్న తల్లితో గొడవపడి సూసైడ్ చేసుకుంది. 3 రోజుల క్రితం మీర్పేట్లోనూ BSc విద్యార్థిని హిమబిందు పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. పెట్స్పై ప్రేమతో ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 21, 2026
రైతులకు గుడ్ న్యూస్: రేపటి నుంచే ఖాతాల్లోకి ‘రైతు భరోసా…!

గద్వాల జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సాగుకు సంబంధించి ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఆదివారం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాలో తొలి విడతలో 1,69,299 మంది రైతులకు ఒక ఎకర భూమి రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28 లోపు పాస్బుక్కులు పొందిన మరో 6 వేల మందికి కూడా ఈ అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 3.52 లక్షల ఎకరాలకు ఈ సాయం అందనుంది.


