News November 19, 2025
ప్రయాణాలు చేయొద్దని గిల్కు డాక్టర్ల సూచన: క్రీడా వర్గాలు

మెడ నొప్పితో బాధపడుతున్న టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ నెల 22 నుంచి SAతో జరిగే రెండో టెస్టులో ఆడే అవకాశాలు కనిపించట్లేదు. ప్రయాణాలు చేయొద్దని ఆయనకు మెడికల్ టీమ్ సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ట్రావెల్ చేస్తే గాయం తీవ్రత పెరిగి, దీర్ఘకాలిక సమస్యగా మారొచ్చని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. రెండో టెస్టులో గిల్ను ఆడించాలా వద్దా అనే దానిపై ఈనెల 21న నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Similar News
News March 13, 2026
యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

ఒమన్లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.
News March 13, 2026
టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన పథకంపై కుట్రలు చేసినా, నాణ్యత తగ్గినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2026
భారత్కు బయల్దేరిన LPG ట్యాంకర్?

హార్ముజ్పై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నా భారత్కు వస్తున్న భారీ LPG ట్యాంకర్ జలసంధిని దాటినట్లు సమాచారం. భారత్లో గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్తో భారత్ పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు భారత్-ఇరాన్ మిత్రదేశాలని, హార్ముజ్ ద్వారా భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని ఢిల్లీలోని ఆ దేశ అంబాసిడర్ తెలిపారు.


