News November 19, 2025
నారాయణపేట: పొగమంచులో ఓవర్టేక్ చేయొద్దు: ఎస్పీ

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 30, 2026
నలుగురి హత్య కేసులో 12 మందికి జీవిత ఖైదు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి.చింతకుంటలో 2012లో జరిగిన హత్య ఉదంతంలో ఐదో అదనపు జిల్లా జడ్జి కీలక తీర్పునిచ్చారు. కృష్ణారెడ్డి, గోవిందమ్మతో పాటు వారి కుమారుడు, పనిమనిషిని దారుణంగా హత్య చేసిన కేసులో 12 మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు. మొత్తం 19 మంది నిందితుల్లో ఏడుగురు ఇప్పటికే మరణించగా, మిగిలిన వారికి ఈ శిక్ష ఖరారు చేశారు.
News March 30, 2026
సల్మాన్- వంశీ పైడిపల్లి సినిమా.. ఏప్రిల్ నుంచి షూటింగ్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమా కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడిస్తూ సల్మాన్, వంశీ ఉన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. SVC బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా సల్మాన్ సరసన నటి నయనతార కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ కాంబో ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
News March 30, 2026
అల్లూరి: గుప్తనిధుల కలకలం.. అర్ధరాత్రి పూజలు

ఎండపల్లి పంచాయతీ ఇ.రామవరంలో గుప్తనిధుల తవ్వకాలు తీవ్ర కలకలం రేపాయి. రైతు చింతలయ్య పొలంలో స్థానికులతో కలిసి కొందరు బయటి వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి పూజలు, తవ్వకాలు జరిపారు. ఈ విషయంపై సర్పంచ్ గ్రామసభ నిర్వహించి నిలదీయగా, తవ్వకాలు జరిపినట్లు కోటం పోతురాజు అంగీకరించాడు. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని గంగవరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


