News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

Similar News

News March 17, 2026

నందిగాం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

image

నందిగాం మండలం లట్టిగాం సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలాస నుంచి 49 మంది ప్రయాణికులతో శ్రీకాకుళం వెళ్తున్న పల్లె వెలుగు బస్సు రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద ఆగడంతో వెనుక నుంచి వస్తున్న ట్రావెల్ బస్సు ఢీకొంది.

News March 17, 2026

శ్రీకాకుళం: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

image

మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన సేనాపతి విక్రమ్ కుమార్ ఒకేసారి మూడు ఉద్యోగాలను సాధించాడు. సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన చదువు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్(కర్ణాటక), ఐబీపీఎస్ క్లర్క్, కెనరా బ్యాంక్, కర్ణాటక, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానికులు అభినందనలు తెలిపారు.

News March 17, 2026

SKLM: ‘ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకోవాలి’

image

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు ఆకాంక్షించారు. సోమవారం ఆయన ఆమదాలవలస పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు, పౌష్టికాహారం అందుతుందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.