News November 19, 2025

ప్రధాని మోదీకి పుట్టపర్తిలో ఎమ్మెల్యేల స్వాగతం

image

శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు పుట్టపర్తికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Similar News

News April 1, 2026

కడప జిల్లాలో కేటగిరీలవారీగా పెన్షన్ల వివరాలు ఇలా.!

image

కడప జిల్లాలో ప్రభుత్వం 25 రకాల పెన్షన్లను 2,80,138 మందికి రూ.122.31 కోట్లు పంపిణీ చేస్తోంది.
వృద్ధులు-139343, వితంతువులు-71613.
దివ్యాంగులు-39383, చేనేతలు-9352.
అభయహస్తం-7431, ఒంటరి మహిళలు-4140.
డప్పు వాయిద్యకారులు-3562, చర్మకారులు-2090.
పెరాలసిస్-772, మత్స్యకారులు-535, లివర్ కిడ్నీ మార్పిడి-47.
లెప్రసీ-356, CKDU-648, కళాకారులు-109.
తలసేమియా-85, ట్రాన్స్జెండర్స్-131 మంది ఉన్నారు.

News April 1, 2026

సంగారెడ్డి: గురుకుల కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని సీఓఈ గురుకులాల్లో ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 7లోపు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హులైన గిరిజన విద్యార్థులు www.tgtwreis.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 1, 2026

ఇరాన్‌ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

image

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.