News November 19, 2025

స్టార్టప్‌ల కోసం ₹1000Cr ఫండ్‌: IT స్పెషల్ CS

image

TG: స్టార్టప్‌ల కోసం ₹1000 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు IT డిపార్ట్‌మెంట్ స్పెషల్ CS సంజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే జనవరిలో దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బూస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. AIపై పనిచేసే స్టార్టప్స్‌పై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణను లీడింగ్ గ్లోబల్ AI హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.

Similar News

News March 22, 2026

TODAY HEADLINES

image

☛ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు
☛ హార్ముజ్‌ను తెరవండి.. ఇరాన్‌కు 22 దేశాల లేఖ
☛ ఇకపై ఖర్చులు పెరుగుతాయనేది నిజం: రాహుల్
☛ రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్
☛ తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు: CBN
☛ AP: ‘గురుకుల’ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
☛ ఆగమశాస్త్రానుసారం ‘భద్రాచలం’ అభివృద్ధి: రేవంత్
☛ 6 గ్యారంటీలకు చట్టబద్ధతతో ఎన్నో లాభాలు: KTR

News March 22, 2026

ఐపీఎల్‌కు బారెడు.. టెస్టులకు చారెడు!

image

క్రేజ్‌‌ను క్యాష్ చేసుకునేందుకు BCCI ఏటా ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచుతోంది. ఈసారి పది మ్యాచ్‌లు పెంచి 84కి చేర్చింది. ఇది బాగానే ఉన్నా భారత్ లాంగ్ ఫార్మాట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ తర్వాత IND షెడ్యూల్‌లో 16 T20లు, 15 ODIలు ఉంటే టెస్టులు మాత్రం ఐదే ఉన్నాయి. అఫ్గాన్‌తో ఒకటి, శ్రీలంక- NZతో చెరో రెండు టెస్టులు IND ఆడనుంది. దీంతో బీసీసీఐ టెస్ట్‌లను విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News March 22, 2026

పెరగనున్న విమానాల టికెట్ల ధరలు?

image

యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విమాన టికెట్ల ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ఇంధన(ATF) ధరలూ ఎగబాకే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏప్రిల్ 1న వీటిని సవరిస్తుంటారు. దీంతో టికెట్లపై దాని ప్రభావం ఆ రోజునే తెలుస్తుందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ఇటీవల అన్నారు. కాగా ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ సర్‌ఛార్జ్ పేరిట ప్రయాణికులపై భారం మోపుతున్నాయి.