News November 19, 2025
విష్ణు సహస్ర నామాలు ఎలా ఏర్పడ్డాయి?

భీష్ముడు అంపశయ్యపై తొలిసారిగా విష్ణు సహస్ర నామాలను స్తుతించాడు. ఇవి విష్ణుమూర్తి గొప్పతనాన్ని, ఆయన 1000 పేర్లను సూచిస్తాయి. అయితే కృష్ణుడి సలహాతో సహదేవుడు ఆ నామాలను మళ్లీమళ్లీ వినిపించేలా చేశాడు. అదే సమయంలో వ్యాసుడు వాటిని రాశాడు. ఈ నామాలను పఠించినవారికి ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెరుగుతుందని, వారిని భక్తి మార్గాన పయణించేలా చేస్తుందని నమ్మకం. ఆ నామాలు, వాటి భావాలను Way2News రోజూ మీకు అందిస్తుంది.
Similar News
News March 31, 2026
IPL బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ మృతి

ENGకు చెందిన IPL బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ జాన్ విలియమ్(76) మరణించారు. ఈ నెల 29న MI-KKR మ్యాచ్ తర్వాత హోటల్కు వెళ్లారు. మరుసటి రోజు కాల్ చేసినా స్పందించకపోవడంతో సిబ్బంది మాస్టర్ కీతో డోర్ తెరిచి చూడగా జాన్ నేలపై పడిఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టంలో అనుమానాస్పదంగా ఏమీ లేనప్పటికీ అసహజ మరణంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
News March 31, 2026
మలయాళ డైరెక్టర్తో ఐకాన్ స్టార్ 25వ చిత్రం?

అల్లు అర్జున్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ‘AA22’ తెరకెక్కుతుండగా, ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక 25వ చిత్రానికి మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. దీన్ని ‘గీతా ఆర్ట్స్’ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనుందని తెలుస్తోంది. కేరళలో ఐకాన్ స్టార్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
News March 31, 2026
రేపటి నుంచి NTR వైద్యసేవలు బంద్!

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)లను నిలిపివేయనున్నట్లు నెట్వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. రూ.3వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాయి.


