News November 19, 2025
రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.
Similar News
News March 21, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: మంత్రి నాదెండ్ల

రాష్ట్రంలో గ్యాస్ కొరత అపోహలపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 2.96 లక్షల బుకింగ్స్ రాగా 2.78 లక్షల డెలివరీలు పూర్తి చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా రూమర్స్ వల్లే అధిక బుకింగ్స్ జరుగుతున్నాయని, 26న విశాఖకు LPG నౌక చేరుకుంటుందని సరఫరా మరింత మెరుగవుతుందన్నారు. గ్యాస్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News March 21, 2026
మార్కాపురం కలెక్టర్గా విజయ సునీత

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఎం.విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. త్వరలోనే మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కలెక్టర్గా ఆమె ఈ ఘనత సాధించనున్నారు.
News March 21, 2026
పోలవరం జిల్లా మొదటి కలెక్టర్ ఈయనే..!

పోలవరం జిల్లా నూతన కలెక్టర్గా దినేశ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయుష్ డైరెక్టర్గా ఉన్న ఆయన, ఇకపై పోలవరం జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి అల్లూరి జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు దినేశ్ కుమార్ మొదటి పూర్తిస్థాయి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


