News November 19, 2025
సంచలనం.. ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం?

ఎర్రకోట ఆత్మాహుతి దాడిలో తుర్కియే సంస్థల హస్తం ఉన్నట్లు NIA అనుమానిస్తోంది. ఇవాళ గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ Pvt Ltd ప్రింటింగ్ ప్రెస్లో ATS తనిఖీలు చేసింది. విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ను ప్రచురిస్తున్నట్లు గుర్తించింది. CCTV ఫుటేజ్, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సూసైడ్ బాంబర్ ఉమర్ 2022లో తుర్కియేకు వెళ్లి ఫారిన్ హ్యాండ్లర్ ఉకాసాను కలిసినట్లు సమాచారం.
Similar News
News March 21, 2026
డియాగో గార్సియాపై ఇరాన్ దాడి.. ఖండించిన బ్రిటన్

ఇండియన్ ఓషన్లో ఉన్న US-UK మిలిటరీ బేస్ డియాగో గార్సియాపై <<19440362>>ఇరాన్ దాడిని<<>> బ్రిటన్ ఖండించింది. అలాగే గల్ఫ్ దేశాలపై దాడులను తప్పుపట్టింది. హార్ముజ్ జలసంధిని మూసేయడాన్ని తమకు, తమ మిత్ర దేశాలకు ముప్పుగా అభిప్రాయపడింది. ఈ యుద్ధంలో బ్రిటన్ నేరుగా పాల్గొనకపోయినా తమ స్థావరాలను వాడుకునేందుకు అమెరికాకు అనుమతించిన విషయం తెలిసిందే. అందుకే డియాగో గార్సియాను ఇరాన్ టార్గెట్ చేసింది.
News March 21, 2026
దాడులు ఆపండి.. ఇరాన్కు 22 దేశాల లేఖ

పశ్చిమాసియాలో 20 రోజులుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని వెంటనే ఓపెన్ చేయాలంటూ 22 దేశాలు ఇరాన్కు లేఖ రాశాయి. ఈ జాబితాలో UAE, UK, బహ్రెయిన్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాలున్నాయి. గల్ఫ్ రీజియన్లోని ఆయిల్, గ్యాస్ క్షేత్రాలపై దాడులను ఆపాలని కోరాయి. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నాయి.
News March 21, 2026
ఇరాన్కు వెళ్లిపోండి.. షియా ముస్లింలను అవమానించిన మునీర్

ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి ఇఫ్తార్ విందులో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ షియా ముస్లింలను తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. ‘మీరు ఇరాన్ను ఎక్కువగా ఇష్టపడితే అక్కడికే వెళ్లిపోండి’ అని వ్యాఖ్యానించినట్లు CNN-News18 వెల్లడించింది. షియా మతపెద్దలు, స్కాలర్లకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపింది. దీంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కాగా ఇరాన్లో షియా, పాక్లో సున్నీ ముస్లింలు ఎక్కువ.


