News November 19, 2025
నారాయణపేట: పొగమంచులో ఓవర్టేక్ చేయొద్దు: ఎస్పీ

చలికాలంలో ఉదయం రోడ్లపై పొగమంచు పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉందని నారాయణపేట ఎస్పీ వినీత్ వాహనదారులను హెచ్చరించారు. వాహనాల వేగం తగ్గించి, సురక్షిత దూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా, పొగమంచులో ఓవర్టేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.
News March 5, 2026
రాజమండ్రి: ఈనెల 8న జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(SAAP) ఆదేశాల మేరకు ఈ నెల 8న తూర్పుగోదావరి జిల్లా స్థాయి ‘శాప్ లీగ్స్’ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి(DSDO) డి.ఎమ్.ఎమ్. శేషగిరి తెలిపారు. హుకుంపేటలోని బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు, ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News March 5, 2026
జగన్ పాపాలే వైసీపీకి శాపాలు: మంత్రి ఆనం

AP: మండలిలో కల్తీ నెయ్యిపై చెలరేగిన మంటలు చల్లారడం లేదు. YCP సభ్యుల ఆందోళనల మధ్యే తిరుమల లడ్డూపై మంత్రి ఆనం ప్రసంగించారు. ‘నివేదికలు కల్తీ జరిగాయని చెబుతుంటే YCP దుష్ప్రచారం చేస్తోంది. కల్తీ జరిగినట్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారు కదా? జగన్ పాపాలే ఆ పార్టీకి శాపాలుగా మారాయి. గోవిందుడి తిరునామం కన్నెర్రజేసింది కాబట్టే 11 సీట్లు వచ్చాయి’ అని విమర్శించారు. సభ రేపటికి వాయిదా పడింది.


