News November 19, 2025

కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

image

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2026

ఇండియన్లు సంతోషంగా లేరు!

image

UN రిలీజ్ చేసిన ‘ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ రిపోర్ట్’ ప్రకారం ఇండియన్లు సంతోషంగా లేరని తేలింది. 147 దేశాలపై చేసిన స్టడీలో భారత్ 116వ స్థానంలో ఉంది. సామాజిక మద్దతు, ఆర్థిక అసమానతలు, పట్టణీకరణ, వ్యక్తిగత స్వేచ్ఛ, GDP, అవినీతి అంశాల ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. ఫిన్లాండ్ వరుసగా 9వ సారి టాప్-1గా నిలిచింది. అఫ్గాన్(147) చివర్లో ఉండగా, పాక్(104) మనకన్నా ముందుండటం ఆశ్చర్యకరం.
*నేడు అంతర్జాతీయ సంతోష దినోత్సవం

News March 20, 2026

రోడ్లపై ఉమ్మినందుకు ₹3.44 లక్షల ఫైన్!

image

లండన్‌లోని రోడ్లపై పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు అధికారులు ₹3.44 లక్షల జరిమానా విధించారు. గతేడాది జూన్‌లో కింగ్స్‌బరీ రోడ్డులో అక్షిత్ కుమార్, నార్త్ వెంబ్లే స్టేషన్ వద్ద హితేశ్ పటేల్ ఉమ్మేశారు. దీంతో వారికి 100 పౌండ్ల(₹12,533) చొప్పున అధికారులు స్పాట్ ఫైన్ వేశారు. కానీ వాళ్లు చెల్లించకపోవడంతో 1,391 పౌండ్ల(₹1.72 లక్షలు) చొప్పున ఫైన్ వేస్తూ బ్రెంట్ కౌన్సిల్‌ ఆదేశాలిచ్చింది.

News March 20, 2026

హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు.. ఇరాన్ ప్లాన్!

image

ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడాలని ఇరాన్ ప్లాన్ వేస్తోంది. ఈ మార్గంలో వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. జలసంధిలో సముద్ర రవాణా భద్రత వల్ల లబ్ధి పొందుతున్న దేశాలు ఇరాన్‌కు ఫీజులు, పన్నులు చెల్లించాలని ఓ చట్ట సభ్యుడు చెప్పినట్లు పేర్కొంది.