News November 19, 2025

నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

image

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.

Similar News

News March 16, 2026

BIG BREAKING: ADB: మాజీ MLA మృతి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మాజీ MLA అజ్మీరా గోవింద్ నాయక్ కాసేపటి క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం ఆయన దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఉన్న తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3 సార్లు MLAగా గెలుపొందారు. మొదటి సారి ఇండిపెండెంట్‌గా గెలవగా ఆ తర్వాత TDP, BRS నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంత కాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమయ్యారు.

News March 16, 2026

గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు

image

LPGకి హైడిమాండ్ నెలకొన్న వేళ PNG కనెక్షన్లకు ప్రజలను ఆకర్షించేందుకు గ్యాస్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. MAR 31లోగా రిజిస్టరయ్యే డొమెస్టిక్ యూజర్లకు GAIL, ఇంద్రప్రస్థ గ్యాస్ సంస్థలు ₹500 విలువైన ఫ్రీ గ్యాస్ అందించనున్నాయి. మహానగర్ గ్యాస్.. కమర్షియల్‌ కనెక్షన్ల సెక్యూరిటీ డిపాజిట్ (₹1L-5L), డొమెస్టిక్‌‌ రిజిస్ట్రేషన్ ఫీ (₹500)పై మినహాయింపు ఇచ్చింది. BPCL కూడా కమర్షియల్‌పై జీరో డిపాజిట్ ప్రకటించింది.

News March 16, 2026

జగిత్యాల: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి

image

జగిత్యాల జిల్లాలో మార్క్‌ఫ్‌డ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అంతకుముందు జీవన్ రెడ్డి రైతులతో కలిసి బైక్ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.