News November 19, 2025
కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
రోహిత్ రెడ్డి ఆహ్వానంతోనే పార్టీకి వచ్చారు: FIR

TG: మొయినాబాద్ <<19386155>>కేసులో<<>> మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆహ్వానంతోనే నిందితులు పార్టీకి వచ్చినట్లు FIRలో వెల్లడైంది. 11 మందిని పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని, సిమ్లాలో కొకైన్ కొన్నట్టు నిందితుడు కౌశిక్ అంగీకరించినట్లు పేర్కొంది. పోలీసులమని చెప్పినా షూట్ చేశారని.. రోహిత్ రెడ్డి సోదరుడైన రితేశ్ రెడ్డి పేరున ఉన్న ఆ గన్ను సీజ్ చేసినట్లు పేర్కొంది.
News March 16, 2026
దేశంపై యుద్ధ ప్రభావం పడకుండా మోదీ చర్యలు: చంద్రబాబు

AP: యుద్ధ ప్రభావంతో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్కు ఇబ్బందులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా PM మోదీ చర్యలు చేపడుతున్నారు. కష్టకాలంలో కుంగిపోకుండా సమష్టిగా పనిచేయాలి. అభివృద్ధి ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టి శ్రీరాములు వంటి వారి త్యాగాలను గుర్తు తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి’ అని అమరావతిలో అమరజీవి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
News March 16, 2026
రైతులకు ఉచితంగా యూరియా!

TG: రైతులకు ఉచితంగా యూరియా సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ‘రైతు భరోసా’ జాప్యం నేపథ్యంలో యూరియా ఉచిత సరఫరా వల్ల రైతులకు ఒకింత ఊరట, ప్రయోజనం కలుగుతుందని అందులో వివరించింది. గత BRS ప్రభుత్వ హయాంలోనూ రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదు. ఈసారి CM ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలలో దీనిని చేర్చే అవకాశం ఉంది.


