News November 19, 2025

HYD: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 11,226 కేసుల పరిష్కారం

image

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్‌లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్‌లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.

Similar News

News March 14, 2026

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో ప్రజల ఆందోళనలు తొలగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్‌తో కలిసి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు, పలు రెవెన్యూ అంశాలపై తహశీల్దార్లతో జూమ్ కాల్ ద్వారా సమావేశం నిర్వహించారు.

News March 14, 2026

అదనపు ఛార్జీలు తీసుకుంటే చర్యలు: RDO

image

జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజన్ అధికారి భవన అన్నారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. LPG పంపిణి సంస్థలు తప్పనిసరిగా స్టాక్ బోర్డును ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్ సరఫరా చేయాలన్నారు. అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.

News March 14, 2026

శ్రీశైలంలో క్యూలైన్లను పరిశీలించిన ఎస్పీ

image

ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని ముందస్తుగా శ్రీశైలానికి భారీ సంఖ్యలో కన్నడ భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ క్యూ లైన్లను ఎస్పీ సునీల్ షోరాణ్ శనివారం పరిశీలించారు. ఉగాది ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ వారి సూచనలు అనుసరిస్తూ సురక్షితంగా భక్తులు దైవదర్శనం చేసుకోవాలన్నారు.