News November 19, 2025
స్టార్టప్ల కోసం ₹1000Cr ఫండ్: IT స్పెషల్ CS

TG: స్టార్టప్ల కోసం ₹1000 కోట్ల ఫండ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు IT డిపార్ట్మెంట్ స్పెషల్ CS సంజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే జనవరిలో దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ను బూస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. AIపై పనిచేసే స్టార్టప్స్పై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణను లీడింగ్ గ్లోబల్ AI హబ్గా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.
Similar News
News March 28, 2026
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్

LPG సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. ఫేక్ వెబ్సైట్లు, వాట్సాప్ లింకులు, నకిలీ కాల్స్ ద్వారా వినియోగదారుల బ్యాంక్ వివరాలు, OTPలు సేకరించి కేటుగాళ్లు సొమ్ము దోచుకుంటున్నారు. అందుకే ఎవరికీ OTPలు చెప్పవద్దని, ఫేక్ APK ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని సూచించింది. కేవలం అధికారిక వెబ్సైట్లు, యాప్ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
News March 28, 2026
యుద్ధ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం: మోదీ

పశ్చిమాసియాలో యుద్ధంతో అనేక దేశాల్లో ఆహారం, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని PM మోదీ తెలిపారు. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పౌరులంతా ఐక్యంగా, ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. భయాందోళనలు రేకిత్తించే తప్పుడు ప్రచారాలు చేయొద్దని పార్టీలకు హితవు పలికారు. నోయిడా(UP)లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తొలి దశను ఆయన ప్రారంభించారు.
News March 28, 2026
గంభీర్ ఫొటోలు వాడొద్దు: హైకోర్టు

టీమ్ఇండియా కోచ్ గంభీర్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఫొటో, వాయిస్తో రూపొందించిన ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్ను 36 గంటల్లోగా తొలగించాలని ఇన్స్టా, గూగుల్ సహా ఇతర SM ప్లాట్ఫామ్స్ను ఆదేశించింది. ఈ కంటెంట్ను క్రియేట్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అనుమతి లేకుండా వీడియోలు చేయడం వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.


