News April 15, 2024

రాజంపేట: హాస్టల్‌లో ఉరి వేసుకుని విద్యార్థిని సూసైడ్

image

రాజంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన రేణుక కొత్త బోయనపల్లి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రేణుక సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బలవంతంగా తీసి చూడగా ఉరివేసుకుని చనిపోయినట్లుగా గుర్తించామని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2026

అరకప్పు కాఫీకి కాడు అభివృద్ధి కోసం పని చేయండి: కడప కలెక్టర్

image

ప్రొద్దుటూరు అభివృద్ధి సమీక్షలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అరకప్పు కాఫీ కోసం కాకుండా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని పొద్దుటూరు మున్సిపల్ అధికారులకు చురకలు అంటించారు. ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు 1/2 టీ కోసం గొడవ పడి, హోటల్ ర్యాంప్ కూల్చివేతకు జేసీబీ తీసుకెళ్లారు. ఈ ఘటనపై ACP నాగరాజును సస్పెండ్, ఛైర్మన్ వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేశారు.

News February 11, 2026

కడప: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

image

కడప జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని DEO షంషుద్దీన్ చెప్పారు.

News February 10, 2026

కడప: డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఇదే చివరి అవకాశం

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెండింగ్ సబ్జెక్టులను ఒకేసారి రాసుకునే అవకాశాన్ని కల్పించినట్లు సీఈ ప్రొ. కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. 2010 నుంచి 2019 సంవత్సరాలలో డిగ్రీ చదివి పాస్ కాని వారికి ఇదే చివరి అవకాశమన్నారు. మార్చి 16వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు YVU అధికార వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.