News November 19, 2025

ర్యాలీని ప్రారంభించిన మేయర్, కమిషనర్

image

వరల్డ్ టాయిలెట్ డేను పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులతో మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సమావేశం నిర్వహించారు. అనంతరం సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు వాహనాలతో ఏర్పాటు చేసిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఉత్తమ సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులను మేయర్, కమిషనర్ సత్కరించారు.

Similar News

News March 13, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 13, 2026

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్: కలెక్టర్

image

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 15 ఏళ్లలోపు బాలికలందరికీ జనరల్, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.

News March 13, 2026

అల్లూరి: 4 మండలాల్లో 100 శాతం పన్నుల వసూళ్లు

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలోని 4 మండలాల్లో 100శాతం ఇంటి పన్నులు వసూలు జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ గురువారం తెలిపారు. కొయ్యురు, హుకుంపేట, ముంచింగిపుట్టు, పోలవరం జిల్లాలో వై.రామవరం మండలాల్లో పూర్తి గా పన్నులు వసూలు అయ్యాయన్నారు. జిల్లాలో మొత్తం 430 పంచాయతీల్లో 373 పంచాయతీల్లో పన్నులు వసూళ్లు పూర్తి అయ్యిందన్నారు.