News November 19, 2025
బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ పేరును BJP ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రేపు ఉ.11.30 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో 10వ సారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు మరో 19మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 202 సీట్లు సాధించింది.
Similar News
News March 18, 2026
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. అల్లూరి, పోలవరం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. కాగా ఇప్పటికే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆకాశాన్ని మబ్బులు కమ్మేయగా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షం పడుతోంది.
News March 18, 2026
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 18, 2026
ఇదేంటి భయ్యా.. రోజూ రేట్ పెంచుతున్నారు?

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న, జాబ్ చేస్తూ రూముల్లో ఉంటున్న బ్యాచిలర్లు అంటున్న మాటలివి. LPG కొరతతో పలు హోటళ్లు క్లోజింగ్ బోర్డులు పెట్టగా.. మరికొన్ని టిఫిన్లు, కర్రీలపై 2-3 రోజులకు రూ.5 పెరుగుతోందని వాపోతున్నారు. గ్యాస్ కొరత నిజమే అయినా రోజూ దాన్ని సాకుగా చూపుతూ ధరలు పెంచడం కరెక్ట్ కాదంటున్నారు. గత 10 రోజుల్లో వీటిపై రూ.15 వరకు పెంచినట్లు చెబుతున్నారు. మీ ఏరియాలో ఎలా ఉంది?


