News November 19, 2025
ప్రజల సొమ్ముతో పక్క రాష్ట్రంలో జల్సాలు: YCP

AP: ప్రజల సొమ్ముతో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ స్పెషల్ ఫ్లైట్లలో జల్సాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘వీకెండ్ వస్తే చాలు స్పెషల్ ఫ్లైట్లో HYDకు వెళ్లిపోతారు. ఎవడి అబ్బ సొమ్ము అని ఇలా ప్రజాధనాన్ని తగలేస్తున్నారు చంద్రబాబూ? ఈ 17 నెలల్లో చంద్రబాబు 80సార్లు, లోకేశ్ 83సార్లు, పవన్ కళ్యాణ్ 104సార్లు HYDకి వెళ్లారు’ అని విమర్శలు గుప్పిస్తూ పైనున్న ఫొటోను Xలో పోస్ట్ చేసింది.
Similar News
News March 18, 2026
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. వేల సంఖ్యలో తరలివస్తున్న కన్నడిగులు

AP: ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి కన్నడ భక్తులు పోటెత్తుతున్నారు. నల్లమల అడవుల్లో వందలాది కి.మీ నడుచుకుంటూ క్షేత్రానికి చేరుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచీ భక్తులు వస్తుండటం విశేషం. వీరంతా కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న మొక్కులు తీర్చుకుంటున్నారు. 3 రోజుల్లోనే 2 లక్షల మంది స్వామిని దర్శించుకోవడం గమనార్హం. ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి.
News March 18, 2026
ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిని చంపేశాం: ఇజ్రాయెల్

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. టెహ్రాన్పై అర్ధరాత్రి జరిపిన ఎయిర్ స్ట్రైక్లో అతడు చనిపోయినట్లు వెల్లడించారు. ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో ఇరాన్పై దాడులను ఉద్ధృతం చేశామని పేర్కొన్నారు. కాగా వరుసగా టాప్ లీడర్లు మరణిస్తున్నా తాము వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
News March 18, 2026
IPL: ఈసారి ‘క్యాప్’ పెట్టుకునేదెవరో?

సీజన్లో అత్యధిక రన్స్, వికెట్లు తీసిన ప్లేయర్లకు ఆరెంజ్, పర్పుల్ క్యాప్లు ఇస్తారు. గత 5 సీజన్లలో ఒక్కసారి(బ్యాటింగ్ విభాగంలో) మినహా అన్నీ ఇండియన్సే దక్కించుకున్నారు. 2021లో రుతురాజ్(635 రన్స్), హర్షల్ పటేల్(32 వికెట్లు), 2022లో బట్లర్(863), చాహల్(27), 2023లో గిల్(890), షమీ(28), 2024లో కోహ్లీ(741), హర్షల్(24), 2025లో సుదర్శన్(759), ప్రసిద్ధ్(25) గెలిచారు. ఈ సారి ఎవరిని వరిస్తాయనుకుంటున్నారు?


