News November 19, 2025
ఓయూలో ఘనంగా వార్షికోత్సవం

ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ విభాగంలో వార్షికోత్సవం (ఓక్ మైలురాయి), ఎం.కామ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మొత్తం 33 మంది సభ్యులు గల ఈ బ్యాచ్ నుండి 23 మంది పూర్వ విద్యార్థులు ఈ మనోహరమైన సమావేశంలో పాల్గొన్నారు. శతాబ్దంలో తాము సాధించిన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రయాణాలను వివరిస్తూ వారు భావోద్వేగాలను పంచుకున్నారు.
Similar News
News March 25, 2026
మెట్పల్లి: పసుపు క్వింటాల్ రూ.13,189

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలికిన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 13,189, కనిష్ఠం రూ. 9,226, పసుపు గోళ గరిష్ఠం రూ. 11,688, కనిష్ఠం రూ. 9,111, పసుపు చూర గరిష్ఠం రూ. 11,405, కనిష్ఠం రూ. 8,829గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ రోజు మార్కెట్లో మొత్తం 2,448 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.
News March 25, 2026
ఆ ఫుడ్స్ తింటే తండ్రయ్యే ఛాన్స్ తక్కువట!

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నెదర్లాండ్స్లోని ఎరాస్మస్ వర్సిటీ స్టడీలో తేలింది. చిప్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లాంటివి అధికంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ టైమ్ పడుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. అటు మహిళల్లో ఈ ఫుడ్ వల్ల గర్భంలో పిండం ఎదుగుదల నెమ్మదిస్తుందని ఈ సర్వే హెచ్చరించింది.
News March 25, 2026
రేకొండలో విషాదం.. కారు ఢీకొని వ్యక్తి మృతి..!

చిగురుమామిడి మండలం రేకొండలో <<19469508>>మంగళవారం<<>> సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన పొలం వద్దకు వెళ్తున్న గోపగొని రమేష్ను ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ మరిణించారు. రమేష్ మరణంతో రేకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


