News November 19, 2025
HYD: పూజిత చనిపోయింది.. పోలీసుల ప్రకటన

HYD ఘట్కేసర్ పరిధి అవుషాపూర్లోని <<18219517>>అనురాగ్ యూనివర్సిటీలో<<>> BSC నర్సింగ్ 3rd ఇయర్ చదువుతున్న పూజిత(22) ఈనెల 6న కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె పంజాగుట్ట నిమ్స్లో 13 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయిందని ఘట్కేసర్ పోలీసులు ఈరోజు తెలిపారు. కాగా పూజిత స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా తుమ్మలవాడ అని చెప్పారు.
Similar News
News November 21, 2025
తూప్రాన్: విద్యార్థులు ఇష్టంతో చదవాలి: డీఈవో

పదవ తరగతి విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ పేర్కొన్నారు. శుక్రవారం తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఎస్ఎస్సీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేకతలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరాలు ఉంటే సహకరిస్తానని, పరీక్షకు అందరూ హాజరై ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
News November 21, 2025
తూప్రాన్: విద్యార్థులు ఇష్టంతో చదవాలి: డీఈవో

పదవ తరగతి విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ పేర్కొన్నారు. శుక్రవారం తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఎస్ఎస్సీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేకతలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరాలు ఉంటే సహకరిస్తానని, పరీక్షకు అందరూ హాజరై ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
News November 21, 2025
ఎల్కతుర్తి: రైతులందరూ ఉపయోగించుకోవాలి: కలెక్టర్

ఎల్కతుర్తి మండలంలోని CCS పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఇంతకు ముందు పత్తిని రైతులు దూర ప్రాంతాల్లో అమ్ముకొనే వారు, కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రాంతాల్లో అమ్ముకునేందుకు CCS కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్ సంతాజీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


