News November 19, 2025

వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రాయన భాగ్యలక్ష్మీ

image

వైసీపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా రాయన భాగ్యలక్ష్మీని నియమిస్తూ ఆ పార్టీ అధినాయకత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా సంపతి విజితను నియమిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలిగా నియమితులైన భాగ్యలక్ష్మీ ప్రస్తుతం విజయవాడ నగర మేయర్‌గా కొనసాగుతున్నారు.

Similar News

News March 14, 2026

ఇరాన్‌పై అత్యంత శక్తిమంతమైన బాంబులు వేశాం: ట్రంప్

image

మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన బాంబులను ఇరాన్‌లోని <<19335967>>ఖర్గ్<<>> ద్వీపంపై వేశామని ట్రంప్ ప్రకటించారు. అందులోని మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను టచ్ చేయలేదని చెప్పారు. హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటే మాత్రం వెంటనే ఆ పని చేసి తీరుతామని స్పష్టం చేశారు. తన హయాంలో అమెరికా సైన్యం చాలా పవర్‌ఫుల్‌గా మారిందని, తమ దాడులను తట్టుకునే శక్తి ఇరాన్‌కు లేదన్నారు.

News March 14, 2026

హుస్నాబాద్: ఒకే బస్సులో తండ్రీకొడుకుల డ్యూటీ

image

హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. 34 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న బంధనాపురం ఎల్లయ్య, ఆయన కుమారుడు ప్రేమ్(కండక్టర్) శుక్రవారం ఒకే బస్సులో కలిసి విధులు నిర్వహించారు. తండ్రి డ్రైవింగ్ చేస్తుంటే కుమారుడు టికెట్లు జారీ చేయడం ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంది. ఒకే వృత్తిలో ఉంటూ ఇలా ఒకే బస్సులో డ్యూటీ చేయడంపై తోటి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

News March 14, 2026

కర్నూలు జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే..!

image

ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని కర్నూలు డీఈవో సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూళ్లు ఉదయం 7:45 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థికి భోజన వసతిని కల్పించాలన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.