News November 19, 2025
గద్వాల్: మరో సీసీఐ కొనుగోలు సెంటర్ ప్రారంభం

జిల్లాలో మరో సీసీఐ కొనుగోలు సెంటర్ ప్రారంభం కానునట్లు అలంపూర్ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ఎల్లస్వామి తెలిపారు. ప్రస్తుతం బాలాజీ, వినాయక కాటన్ మిల్లులలో సీసీఐ కొనుగోలు జరుగుతుండగా తాజాగా గద్వాల్ మండలం హరిత కాటన్ మిల్లులో ఈనెల 21నుంచి కొనుగోలు జరుగుతాయన్నారు. విక్రయించాలనుకునే రైతులు రేపు గురువారం ఉదయం 8:30కి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. శని ఆదివారాలు మినహా 27వరకు స్లాట్స్ ఓపెన్ అవుతాయన్నారు.
Similar News
News March 19, 2026
నేడే సింహాచలం అప్పన్న పెళ్లిరాట మహోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 29న జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారికి ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు పెళ్లి రాట మహోత్సవం నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువులు పూర్తిచేసి భక్తుల గోవింద నామస్మరణ, మేళతాళాల మధ్య రాట ఉడుపు మహోత్సవాన్ని నిర్వహిస్తారు. నేటి నుంచి స్వామి అమ్మవార్ల పెళ్లి పనులు ప్రారంభమవుతాయి.
News March 19, 2026
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటిస్తారా..!

త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఓ లంబాడా నేతకు బెర్తు దక్కే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. జిల్లా నుంచి ఆ సామాజిక వర్గం నుంచి బాలునాయక్ ఉన్నారు. ఇక మరో నేత రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం కళ్లలో వత్తులేసుకుని చూస్తున్నారు. త్వరలోనే మంత్రిని అవుతానంటూ ఆయన చౌటుప్పల్తో పాటు పలు చోట్ల కామెంట్స్ చేశారు. మరి అమాత్య యోగం ఎవరికి దక్కుతుందో అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
News March 19, 2026
ఒంగోలు: విధుల్లో గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పనిచేస్తున్న ఎక్సైజ్ కార్యాలయ కానిస్టేబుల్ కందుల రాఘవరావు విధుల్లో ఉండగా మృతి చెందారు. సెంట్రీ డ్యూటీలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు కాగా మృతదేహాన్ని అక్కడికి తరలించారు. ఐదు నెలల క్రితం ఈయన ఆత్మకూరుకు బదిలీపై వచ్చారు. ఆఫీసులోనే చనిపోవడంతో సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.


