News November 20, 2025

కామారెడ్డి జిల్లాకు మంత్రి సీతక్క

image

మంత్రి సీతక్క నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉ.10:30 గంటలకు భిక్నూర్ చేరుకుంటారు. భిక్నూర్, కామారెడ్డి AMC భవనాల వద్ద టాయిలెట్ బ్లాక్, కాంపౌండ్ వాల్ తదితర పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, KMR మునిసిపాలిటీ పరిధిలోని వార్డుల్లో CC రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్లు వంటి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. లైబ్రరీ ఉత్సవాల సందర్భంగా గ్రంథాలయ కార్యాలయంలో పుస్తకాలను పంపిణీ చేస్తారు.

Similar News

News March 16, 2026

NZB: సమయపాలన పాటించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

image

ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు సమయపాలన పాటించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్ కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. సోమవారం ప్రజావాణిలో 80 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.

News March 16, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,670
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,416
* వెండి 10 గ్రాముల ధర రూ.2585.

News March 16, 2026

114 అర్జీలను స్వీకరించాం: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 114 పిటీషన్లు స్వీకరించినట్లు ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. పిటీషనర్లతో ముఖాముఖి మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పిటీషనర్లు, వీరి వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పించామన్నారు.