News November 20, 2025

HYD: ట్రేడ్ లైసెన్స్ గడువు పొడిగింపు

image

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త దరఖాస్తుల గడువును GHMC పొడిగించింది. డిసెంబర్ 1 వరకు ఉన్న గడువును MCC కారణంగా డిసెంబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో వ్యాపారులు ఎటువంటి పెనాల్టీ లేకుండా డిసెంబర్ 20 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. లైసెన్స్ లేని వ్యాపారాలపై 100% జరిమానాతోపాటు ప్రతినెల 10% అపరాధ రుసుము వసూలు చేస్తారు.

Similar News

News March 25, 2026

రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

image

పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు APRలో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
*1 బ్యారెల్ అంటే 159 లీటర్లు.

News March 25, 2026

హుజూర్‌నగర్, కోదాడపై డీలిమిటేషన్ ఎఫెక్ట్!

image

రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియతో హుజూర్‌నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పబ్లిక్ టాక్. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కొన్ని మండలాలను ఇతర నియోజకవర్గాల్లో కలపడం లేదా కొత్తవి చేర్చడం జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొరుగున ఉన్న నియోజకవర్గాల విభజన జరిగితే ఆ ప్రభావం నేరుగా HNR, KDDలపై పడనుంది.

News March 25, 2026

రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

image

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.