News November 20, 2025
సిద్దిపేట: కూలి రూపం.. హిడ్మా మరో కోణం!

మావోయిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి దళంలో అత్యంత వేగంగా ఎదిగిన వ్యక్తి హిడ్మా. అయితే హిడ్మా జీవితంలో, మరొక కోణం దాగి ఉంది. పదేళ్ల క్రితం హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టు టన్నుల్లో కూలి రూపంలో పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులో కూలిగా వ్యవహరిస్తూనే ఆయన పార్టీ రహస్య కార్యకలాపాలు చేశాడన్న విషయం తర్వాత పోలీసులకు అర్థమైంది. హిడ్మా మరణంతో ఈ విషయాలు బయటపడుతున్నాయి.
Similar News
News March 16, 2026
కొత్త సబ్జెక్టులతో UG, PG కోర్సులు

TG: పాత డిగ్రీ కోర్సులకు కాలం చెల్లింది. అవి నేటి అవసరాలకు తగ్గట్టు ఉంటేనే ఉపాధి అవకాశాలు. ఈదిశగా TGCHE వాటిని ప్రక్షాళించింది. UG, PGలలో డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్, అగ్రికల్చర్, ఎయిర్ లైన్స్, స్పేస్, మారిటైమ్, ఫిన్టెక్, INT.బ్యాంకింగ్, ఫైనాన్స్, మల్టీమీడియా, యానిమేషన్, బయోమెడిక్స్, MED.మైక్రో బయాలజీ, ఇమ్యూనాలజీ వంటివి పెట్టింది. ఈ సమాచారాన్ని ‘https://tgche.ac.in’లో పొందుపరిచింది.
News March 16, 2026
వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.
News March 16, 2026
కర్నూలు జిల్లాలో మొదటి రోజే 1042 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో 1042 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35851 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా.. 34809 మంది విద్యార్థులు హాజరయ్యారు. 702 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సిందిగా 650 మాత్రమే హాజరయ్యారు. 52 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.


